
జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రెండు రోజుల కింద హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై నిలిచిపోగా, సెల్ ఫోన్ లైట్ వెలుతురులో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా పరిగణించారు.
జనరేటర్ లు ఉన్నప్పటికీ పవర్ కట్ అయిన సమయంలో వాటిని ఆన్ చేయకపోవడంపై విచారణకు ఆదేశించారు. కలెక్టర్, టీవీవీపీ కమిషనర్ నివేదికలో నిర్లక్ష్యం చేసినట్లు తేలడంతో సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.