జుమాటో మోసం చేసిందా : కోటిన్నర జీతం అన్నారు.. ఆ తర్వాత లేదన్నారు

జుమాటో మోసం చేసిందా : కోటిన్నర జీతం అన్నారు.. ఆ తర్వాత లేదన్నారు

ఉద్యోగం వచ్చిదంటే జనాలు ఎగిరి గంతేస్తారు... అదే క్యాంపస్​ సెలక్ట్ మెంట్​ అంటే లైఫ్​ సెటిల్​ అయిందని భావిస్తారు. అందుకే ఇప్పుడు IIT క్యాంపస్​ లకు ఎగబడుతున్నారు.  ఎంత కస్టమైనా సరే సీటు సంపాదించాలంటారు.  ఢిల్లీ IIT క్యాంపస్​ లో ఇంజనీరు విద్యార్థులను రూ. 1.6 కోట్ల శాలరీకి ఇస్తామని రిక్రూట్​ చేసిన కొద్ది రోజులకే ఆ ఉద్యోగాలను రద్దు చేస్తున్నామని జుమాటో సంస్థ ప్రకటింది.. 

వివరాల్లోకి వెళ్తే


భారతదేశంలో ఫుడ్ డెలివరీ (Food Delivery) సంస్థలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ (Online)లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.  అలానే ఫుడ్​ డెలివరీ సంస్థలు ఉద్యోగులు కూడా పెరిగిపోతున్నారు.  చాలామంది నిరుద్యోగులు ఫుడ్​ డెలివరీ సంస్థల్లో  జాబ్​ చేస్తున్నారు.  జొమాటో రూ. 16 కోట్ల వేతనం ఇస్తామని  IIT ఢిల్లీ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ లో  రిక్రూట్​ చేసుకుంది.   ఆ తరువాత అదంతా తూచ్​ అని.. జొమాటో సంస్థ ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది.

Zomatoతో సహా కొన్ని కంపెనీలు  అల్గారిథమ్స్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఢిల్లీ  IIT విద్యార్థులను ఎంపిక చేసి రూ. 1.6 కోట్ల వేతనం ఆఫర్​ కూడా ప్రకటించింది.  దీంతో విద్యార్థులు ఎంతో కుషీ అయ్యారు.  ఇంతలోనే Zomato ట్విట్టర్​ లో పెట్టిన పోస్టు చూసి  డీలా పడ్డారు.  ఈ ఆఫర్​ ను తమ సంస్థ  కేన్సిల్​ చేసిందని ట్వీట్​ చేసింది.  


దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు.  జొమాటో సంస్థ ఢిల్లీ IIT క్యాంపస్​ లో  జాబ్ లను రిక్రూట్​ చేసుకొని భారీ జీతం ఇస్తానని చెప్పి.. ఆ తరువాత ఇవ్వనని చెప్పి మోసం చేసిందని    రీసెర్చ్ ఇంటర్న్ హృతిక్ తల్వార్ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.  మరొకరు 16 లక్షలు కదా.. 1.6 కోట్లు అని తప్పుగా టైప్​ చేశారా కంపెనీని దూషించారు.  ఇంకొకరు  జొమాటో మార్కెటింగ్​ లో ఇది ఒక ట్రిక్​ అని... ఇలా మోసం చేసినందుకు సిగ్గుపడాలని కామెంట్​ చేశారు.

Also read :- మార్పు కోసం కాంగ్రెస్కి ఓటేయండి.. తెలంగాణ ప్రజలకు సోనియా లేఖ