12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు సెప్టెంబర్ నుంచి జైడస్ వ్యాక్సిన్ ఇస్తామన్నారు నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ NK అరోరా. 12 నుంచి 18 ఏళ్ల వారికి సంబంధించి జైడస్ క్యాడిలా ట్రయల్స్ డేటా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. కొద్దిరోజుల్లోనే జైడస్ వ్యాక్సిన్ కు ఎమర్జెన్సీ అప్రూవల్ వస్తుందన్నారు. థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఉంటుందన్న ఊహాగనాల నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నాటికి 2 నుంచి 18 ఏళ్ల వారికి కూడా టీకా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఇక పిల్లలపై కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతాయన్నారు. స్కూల్స్ ప్రారంభం అనేది చాలా కీలకమైన అంశమని, దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయన్నారు అరోరా.