న్యూఢిల్లీ: అస్సాంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తంచేశారు. రాహుల్కు ఎదురవుతున్న సెక్యూరిటీ సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఖర్గే బుధవారం లేఖ రాశారు. రాహుల్కు మరింత సెక్యూరిటీ కల్పించాలని కోరారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా భద్రత కల్పించడంలో ఆ రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందని ఆరోపించారు.
లఖింపూర్ జిల్లాలో యాత్రకు సంబంధించిన పోస్టర్లు, హోర్డింగ్లను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం, ఆపై సోనిత్పుర జిల్లాలో జైరాం రమేశ్ కారుపై దాడి, యాత్రలో పాల్గొన్నోళ్లపై నీళ్లు పోయడం వంటి ఘటనలను ఖర్గే లేఖలో ప్రస్తావించారు. అదే జిల్లాలో బీజేపీ కార్యకర్తలు రాహుల్ కాన్వాయ్ దగ్గరదాకా వచ్చి అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అమిత్షా జోక్యం చేసుకోవాలని ఖర్గే లేఖలో కోరారు.