‘పిల్ల జమిందార్’ చిత్రంతో హీరోయిన్గా ఆకట్టుకున్న బిందు మాధవి.. ఆ తర్వాత వరుస తమిళ సినిమాలతో బిజీ అయింది. అలాగే కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ చేసిన ఆమె కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బిందు మాధవితో పాటు శివాజీ, నవదీప్, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో బిందు మాధవి వేశ్య పాత్ర పోషిస్తోందని, ఎమోషనల్ టచ్తో ఉంటూ ఆలోచింపజేసేలా తన పాత్ర ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.
