మా ఎమ్మెల్యేలకు సొంతూర్లల్లో 50 ఓట్లు కూడా రాలే : కమల్ నాథ్

మా ఎమ్మెల్యేలకు సొంతూర్లల్లో 50 ఓట్లు కూడా రాలే : కమల్ నాథ్

భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలకు వారి వారి సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదన్నారు. మంగళవారం ఆయన భోపాల్​లో ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

మీటింగ్​కు ముందు కమల్​నాథ్ మీడియాతో మాట్లాడుతూ.." ప్రజలు ఎవరివైపు ఉన్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా,  సొంతూళ్ల లో తమకు 50 ఓట్లు కూడా రాలేదని మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదెలా సాధ్యం? " అని కమల్​నాథ్ ప్రశ్నించారు. ఈవీఎం హ్యాకింగ్‌‌ జరిగినట్లు  కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. చర్చలు జరపకుండా ఒక నిర్ధారణకు రావడం సరికాదని ఆయన పేర్కొన్నారు.