పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఆరు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేత
మంచిర్యాల, వెలుగు: కరోనా కష్టకాలంలో పేషెంట్లకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. సర్కారు హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు అవస్థలు పడుతున్న నేపధ్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి తన తండ్రి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించడానికి ముందుకొచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, గోదావరిఖని, పెద్దపల్లి, ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఆరు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కు పది లీటర్ల కెపాసిటీ గల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణకు బుధవారం అందజేశారు. బెల్లంపల్లి ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను డొనేట్ చేయడం అభినందనీయమని, కరోనా కష్టకాలంలో ఇవి పేషెంట్ల ప్రాణాలు కాపాడుతాయని డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ మునిమంద రమేష్, టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, తాండూరు మండల ఇన్చార్జి రెవెళ్లి రాజలింగు, మహిళా మోర్చా డిస్ట్రిక్ట్వైస్ ప్రెసిడెంట్ గోమాస కమల తదితరులు పాల్గొన్నారు. నిరుడు లాక్డౌన్ టైమ్లో కూడా కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా పేదలకు నిత్యావసరాల కిట్లు, ప్రభుత్వ వైద్యసిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేసి వివేక్ వెంకటస్వామి పెద్దమనను చాటుకున్నారు.