హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఫ్యాషన్ రిటైలర్ సీఎంఆర్ షాపింగ్ మాల్ తమ 30వ షోరూమ్ను హైదరాబాద్లోని హయత్నగర్లో గురువారం కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.
మరో షోరూమ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ షాపులో షాపింగ్ ప్రపంచస్థాయి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. సరికొత్త దుస్తులను అందుబాటు ధరల్లోనే ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సినీతారలు ఆషికా రంగనాథ్, అమృతా అయ్యర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జ్యోతిని వెలిగించి స్టోర్ను ప్రారంభించారు. అన్ని సెక్షన్లను తిరుగుతూ డిజైన్లను పరిశీలించారు. అభిమానులతో సెల్ఫీలు తీసుకున్నారు.