
జెరూసలెం: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ ను ప్రారంభించింది. అందులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను షురూ చేసింది.
ఈ క్రమంలో 443 మంది భారతీయులతో కూడిన రెండో బ్యాచ్ ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్, ఈజిప్ట్ సరిహద్దు గుండా ఇండియాకు బయల్దేరింది. సోమవారం వీరు ఇజ్రాయెల్ బార్డర్ను క్రాస్ చేసి జోర్డాన్, ఈజిప్ట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో ఇండియాకు బయల్దేరుతారు. అంతకు ముందు 160 మంది ఇండియన్లను కేంద్రం ఇజ్రాయెల్ నుంచి తరలించింది. దీంతో రెండు రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి తరలించిన వారి సంఖ్య 603కు చేరుకుంది.