జయశంకర్భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఏసీబీ డీఏస్పీ సాంబయ్య నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్ ఏరియాలోని సబ్రిజిస్టర్ ఆఫీసులో సోదాలు జరిగాయి.
అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఏస్పీ సాంబయ్య తెలిపారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు ఆఫీసులోని డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేశారు. ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పలు అంశాలపై ప్రశ్నించారు.
