మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

 మహిళా రిజర్వేషన్ బిల్లుపై  .. పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమకాలీన అంశాలపై రియాక్ట్ అయ్యే హీరోయిన్ పూనమ్ కౌర్ గణేష్ చతుర్థి సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది.  మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలంటూ ట్వీట్ చేసింది.  మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే ఏళ్ల తరబడి పెరుగుతున్న నేరాల రేటు తగ్గుతుందని తన ట్వీట్ లో తెలిపింది. 

అంతేకాకుండా  - రాజకీయ దురాశకు, కీర్తికి అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయంగా ఉపయోగపడేలా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఈ గణేష్ చతుర్థిని ప్రార్థిస్తున్నానంటూ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.  ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

ALSO READ: రెండో పెళ్లిపై ఒత్తిడి పెరిగింది.. క్లారిటీ ఇచ్చిన మీనా

కాగా మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో  కొంత కాలంగా పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.