ఎవరూ పట్టించుకోలేదని ప్రజలే రోడ్డేసుకున్నారు

ఎవరూ పట్టించుకోలేదని ప్రజలే రోడ్డేసుకున్నారు

కాగ జ్ నగర్, వెలుగు: అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన  గ్రామస్థులు రోడ్డుపై మొరం వేసుకుని మరమ్మతులు చేసుకున్నారు.  ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా – చిత్తాం గ్రామాల మధ్య అటవీ ప్రాంతం గుండా మొరం, మట్టి రోడ్డు ఉంది. ఈ రోడ్డు వానాకాలంలో బంద్ ఉంటుంది.

చలికాలం గూడెం నుంచి కాగజ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి  రాకపోకలు సాగించే బస్సు రోడ్డు బాగోలేక రావడం లేదు.  దీంతో  రోడ్డు బాగుచేయాలని ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం గ్రామస్థులే రోడ్డును బాగు చేసుకున్నారు.