- మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో లంచాలు
- స్కామ్స్ అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లిన బీజేపీ
రాయ్పూర్: చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఓటమికి స్కామ్లే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐదేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలే ఎజెండాగా బీజేపీ లీడర్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్ స్కామ్లన్నీ ప్రజల్లోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. సెకండ్ ఫేజ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హయాంలో జరిగిన కోల్ స్కామ్, లిక్కర్ స్కామ్, మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన వ్యవహారాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అధికార పార్టీ లీడర్ల ఇండ్లలో సోదాలు చేశారు. ఈ స్కామ్ వెనుక సీఎం బాఘెల్ హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపించింది.
- మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో యాప్ ప్రమోటర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రూ.508 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
- కస్టమ్ రైస్ మిల్లింగ్ స్కామ్లో స్టేట్ మార్క్ఫెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ట్రెజరర్ రోషన్ చంద్రకర్, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ అధికారులు (డీఎంఓలు), మరికొంత మంది రైస్ మిల్లర్లు సహా రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లోని కొంత మంది ఆఫీస్ బేరర్ల హస్తం ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో రూ.175 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
- మినరల్ ఫండ్ స్కామ్లో ఇల్లీగల్గా టన్ను బొగ్గుపై రూ.25 చొప్పున లెవీ తీసుకున్నట్లు తేలింది. ఈ స్కామ్లో సీనియర్ అధికారులు, వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు, దళారుల హస్తం ఉన్నట్లు ఈడీ తేల్చింది.
- 2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో కూడా అవినీతి జరిగింది. చత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీసీఎస్) అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
- అవినీతి, కుంభకోణాల దర్యాప్తుల్లో కూడా సీఎం భూపేశ్ బాఘెల్ కల్గజేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగినట్లు విమర్శించింది. భూపేశ్ బాఘెల్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చార్జ్ షీట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమంతా.. అవినీతి, కుంభకోణాలు, దోపిడీ మయమైందని ఆరోపించారు.