
- పార్లమెంట్లో బిల్లు పెట్టేలా కేంద్ర మంత్రులు కృషి చేయాలి
హైదరాబాద్, వెలుగు: గోవును జాతీయ మాతగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సెషన్లో దీనికోసం ప్రత్యేకంగా బిల్లు పెట్టాలని కోరారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ మేరకు కృషి చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తన సెక్యూరిటీ గార్డె పోలీసులకు ఇన్ఫార్మర్గా మారిపోయాడని, దీంతో పాతబస్తీలో తాను సెక్యూరిటీ లేకుండానే తిరిగినట్టు చెప్పారు.
గోరక్షణ కార్యకర్తలు ఎవ్వరూ వెహికల్స్ ఆపొద్దని, ఆపితే చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆవులు, గెదేలు రాష్ట్రానికి వచ్చాయని, వాటిని పోలీసులు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఆవుల రక్షణకు చట్టం ఉందని, దాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవును జాతీయ మాతగా ప్రకటించేందుకు ప్రజలు కూడా కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.