భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఓ భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా రైతును వేధించారు. దీంతో బీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక మహిళా రైతు ఆత్మహత్యయత్నం చేసింది. బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన దుర్గకు బీఆర్ఎస్ నేతల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. చెన్నూరు ఎంపీపీ మంత్రి బాపు , కొమ్మెర గ్రామ సర్పంచ్ కొడుకు కిరణ్ భూ వివాదంలో తను వేధించారని బాధితురాలు తెలిపింది. వాళ్ల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు యత్నించానని పేర్కొంది.