గ్యాస్ కట్టర్ తో చోరీకి యత్నం..కాలిపోయిన ఏటీఎం

గ్యాస్ కట్టర్ తో చోరీకి యత్నం..కాలిపోయిన ఏటీఎం

బెంగళూరు :  కొంత మంది దొంగలు గ్యాస్ కట్టర్ తో  ఏటీఎం చోరీకి యత్నించడంతో అందులోని నోట్లు కాలి బూడిదయ్యాయి. గురువారం  బెంగళూరులోని నెలమంగళలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగలు పడ్డ విషయాన్ని ముంబై నుంచి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బ్యాంకు గుర్తించారు.

ఏటీఎం ఉన్న భవన యజమానిని వెంటనే అప్రమత్తం చేశారు. ఇంటి ఓనర్ ఏటీఎం వద్దకు చేరుకునే లోపే దొంగలు తమ సామాన్లను అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేశారు. క్రైమ్ లో ఇద్దరు వ్యక్తులకు ప్రమేయమున్నట్టు సీసీటీవీ  ఫుటేజీ ఆధారంగా గుర్తించారు.