
- పోలీసులకు సహ నిర్మాతల ఫిర్యాదు
జూబ్లీహిల్స్, వెలుగు: కథ బాగాలేదని ఓ నిర్మాత సినిమా స్క్రిప్టుతోపాటు డేటా, కంప్యూటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. దీనిపై మిగిలిన నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో మధురానగర్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కె. వెంకటనారాయణరెడ్డి పలువురు నిర్మాతలు కలిసి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నారాయణరెడ్డి రూ.30 లక్షలు పెట్టాడు. అనంతరం కథ కొత్తగా లేదని మిగితా వారితో విభేదించి సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నాడు.
ఇదిలా ఉండగా, మధురానగర్పరిధిలోని శ్రీసాయి బాలాజీ నిలయంలో ఉన్న కార్యాలయం నుంచి తన అనుచరులు ఆదూరి ఉమామహేశ్వరరెడ్డి, టి. నవీన్ కుమార్రెడ్డి, సాయి కలిసి దౌర్జన్యం చేసి సినిమా స్క్రిప్టుతోపాటు విలువైన కంప్యూటర్లు, డేటాను ఎత్తుకెళ్లాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.