
- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆయుర్వేదం ఒక వైద్యం కాదని జీవన విధానమని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ ఎంపీపీ స్కూల్ లో ఆయుష్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం భారతీయుల జీవితాల్లో భాగమైందన్నారు.
సూర్యుడి ద్వారా లభించే శక్తిని స్వీకరించి సహజసిద్ధంగా పెరిగే మొక్కల నుంచి సేకరించిన వివిధ భాగాల ద్వారా ఆయుర్వేదిక్ మందులను తయారు చేస్తారన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేరుగా వ్యాధి నయం అవడానికి ఈ మందులు పనిచేస్తాయన్నారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 300 మంది వైద్య పరీక్షలు చేసుకొని మందులు తీసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, ఆయుర్వేద వైద్యం జిల్లా ఇన్చార్జి డాక్టర్ ఉమాదేవి, ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు.