మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాజర్షి షా

మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాజర్షి షా
  • కలెక్టర్ రాజర్షి షా​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​పట్టణంలోని రిమ్స్​కు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇతర ఆస్పత్రులకు రిఫర్​చేయకుండా ఇక్కడే వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టర్​ రిమ్స్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, రికార్డులను పరిశీలించారు. స్థానికంగా ఉన్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్​షాపులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

కార్పొరేట్​ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో నిర్వహించే సర్జరీలు ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నవజాత శిశు మరణాలు జరగకుండా ఎస్​ఎన్​సీయూ ప్రత్యేత్యంగా చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్​ వెంట డైరెక్టర్ ​జైసింగ్ ​రాథోడ్, డీఎంహెచ్​ఓ నరేందర్ రాథోడ్​ తదితరులు ఉన్నారు.