
- కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
తిర్యాణి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం తిర్యాణి మండలం గిన్నెదరిలోని పీహెచ్సీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు క్లీన్ గా ఉంచాలని డాక్టర్లకు సూచించారు. ట్రీట్మెంట్ కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.
బ్లడ్ టెస్ట్ నిర్వహించాలని, విషజ్వరాలపై అలర్ట్గా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అనంతరం గిన్నెదరి ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ను పరిశీలించి స్టూడెంట్ల హాజరు, క్లాస్ రూమ్స్, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. టీచర్లు నాణ్యమైన బోధన అందించాలని, టెన్త్ క్లాస్ స్టూడెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. స్టూడెంట్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేశ్, హెచ్ఎం కృష్ణారావు, డాక్టర్లు కౌటిల్య తదితరులు పాల్గొన్నారు.