
- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఎల్సీడీ స్క్రీన్పై ఆయా శాఖల ఆఫీసర్లు వీక్షించారు.
ఈ సందర్భంగా చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనం పాటిస్తూ అందిస్తామని ఆఫీసర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, ఏవో ప్రశాంత్ తదితరులు ఉన్నారు.