కాంట్రాక్టర్ల కోసమే వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు : శ్రీనివాస్ రెడ్డి

కాంట్రాక్టర్ల కోసమే వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు : శ్రీనివాస్ రెడ్డి
  •     కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీలో ఉన్న 110 చెత్త సేకరణ, స్వీపింగ్ వాహనాలకు రోజుకో రిపేర్ వస్తోందని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టర్ల కోసమే వీటికి రిపేర్లు వస్తున్నట్లున్నాయని ఆరోపించారు. మంగళవారం మున్సిపల్​ కార్యాలయంలోని ఇన్​చార్జి చైర్మన్​ అబ్బగోని రమేశ్ గౌడ్​ అధ్యక్షతన కౌన్సిల్​ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి వస్తున్నందున తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

తాగునీటిని క్రమపద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్న ఆపరేటర్లను సస్పెండ్​ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ప్రతి అంశానికి కాంట్రాక్టర్లపై ఆధారపడకుండా వాళ్లే స్పందించాలని  సూచించారు. బీఆర్ఎస్​ఫ్లోర్​ లీడర్ అభిమన్యు శ్రీనివాస్​ మాట్లాడుతూ.. వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను కాంట్రాక్టర్  రిపేర్​ చేయించడం లేదని, వారం, పదిరోజులు మూలనపడితే చెత్త తరలింపు ఆగిపోతుందన్నారు. ఇద్దరు మెకానిక్‌‌‌‌‌‌‌‌లను పెట్టి  రిపేర్​ చేయించాలని కోరారు. వీధిలైట్ల కాంట్రాక్టర్​ లైట్లు కూడా వేయించడంలేదని, ఇద్దరు కాంట్రాక్టర్లు ఆస్థాన కవులుగా మారిపోయారని విమర్శించారు.  

బీజేపీ ఫ్లోర్​ లీడర్​ బండారు ప్రసాద్​ మాట్లాడుతూ..  గతంలో జరిగిన పొరపాట్లను సవరించడం అభినందీయమని, మున్సిపాలిటీ తీర్మానం లేకుండా చేసిన పనులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తీర్మానం లేకుండా కోట్ల రూపాయలు కేటాయించడం సరికాదన్నారు. కౌన్సిలర్​ ఖయ్యుంభేగ్​ మాట్లాడుతూ.. కార్మికులందరికీ  ఈఎస్ఐ, పీఎఫ్ ​సౌకర్యం కల్పించాలని కోరారు.  మాజీ చైర్మన్​ బొడ్డుపల్లి లక్ష్మీ మాట్లాడుతూ.. సావర్క్​నగర్​ ప్రాంతంలో తాగునీటి సరఫరాలో లోపాలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇన్​చార్జి చైర్మన్ రమేశ్ గౌడ్​ మాట్లాడుతూ....  శివాజీనగర్​ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని, పట్టణంలో గుంతలుగా మారిన రోడ్లకు రిపేర్లు చేపట్టామని తెలిపారు.  రూ.30లక్షలతో చేపల మార్కెట్​నిర్మిస్తున్నామని, యువత చదువుకునేందుకు మొబైల్​ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్​ రవి, అసిస్టెంట్​ కమిషనర్​ సయ్యద్​ ముసాబ్ అహ్మద్​, ఈఈ రాములు, అధికారులు పాల్గొన్నారు.