నేన్నది వాస్తవమని తెలిసే మోదీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: రాహుల్ గాంధీ

నేన్నది వాస్తవమని తెలిసే మోదీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాను  శక్తి గురించి చేసిన వ్యాఖ్యలను ప్రధాని వక్రీకరించారని అన్నారు. తాను వాస్తవాలే మాట్లాడనని ప్రధానికి కూడా తెలుసని, కావాలనే ఆయన మాట్లాడిన శక్తి వ్యాఖ్యలను వక్రీకరించారని రాహుల్ ఆరోపించారు. ఆదివారం భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో హిందూమంలో శక్తి అన్న పదం ఉన్నదని, ఆ శక్తితో తాము పోరాడుతున్నామని అన్నారు. ఆ శక్తి ఏంటన్నదే తెలియదని, ఓ రాజు ఆత్మ ఈవీఎంలో ఉందని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల్లో ఆ రాజు ఆత్మ ఉందని పరోక్షంగా మోదీని విమర్శించారు. 

శక్తి గురించి మాట్లాడిన రాహుల్ వ్యాఖ్యలకు ఈరోజు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా శక్తి వినాశనాన్ని కోరుకుంటారా అని జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మెదీ ప్రశ్నించారు. భారత నేలపై ఎవరైనా శక్తి వినాశనం గురించి మాట్లాడతారా, మనం అందరం శక్తిని ఆరాధిస్తామని చెప్పుకొచ్చారు. చంద్రయాన్ 3 విజయాన్ని కూడా శక్తిగా గుర్తించామని, అందుకే ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి అని పేరు పెట్టినట్లు ప్రధాని గుర్తి చేశారు.