- 17 సీట్లు 309 అప్లికేషన్లు
- కాంగ్రెస్ ఎంపీ టికెట్లకు భారీ డిమాండ్
- మహబూబాబాద్ సీటు కోసం 48 మంది దరఖాస్తు
- రిజర్వ్డ్ సెగ్మెంట్లలో భారీగా పోటీ
- పాలమూరు నుంచి నాలుగు అప్లికేషన్స్
హైదరాబాద్: రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు, లీడర్ల వారసులు ఉన్నారు. రిజర్వ్డ్ సెగ్మెంట్లకు అత్యధికంగా దరఖాస్తులు రావడం విశేషం. మహబూబాబాద్ (ఎస్టీ) సెగ్మెంట్ కోసం అత్యధికంగా 48 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వరంగల్ (ఎస్సీ) నుంచి 42 మంది, పెద్దపల్లి(ఎస్సీ) నుంచి 29 మంది, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి అతి తక్కువగా నలుగురే అప్లికేషన్ పెట్టుకున్నారు. సెగ్మెంట్ల వారీగా పోటీ ఇలా ఉంది...
- ఆదిలాబాద్ (ఎస్టీ) 22
- పెద్దపల్లి (ఎస్సీ) 29
- కరీంనగర్ 14
- నిజామాబాద్ 09
- జహీరాబాద్ 06
- మెదక్ 11
- మల్కాజ్ గిరి 11
- సికింద్రాబాద్ 16
- హైదరాబాద్ 11
- చేవెళ్ల 11
- మహబూబ్ నగర్ 04
- నాగర్ కర్నూల్(ఎస్సీ) 26
- నల్లగొండ 09
- భువనగిరి 28
- వరంగల్ (ఎస్సీ) 42
- మహబూబాబాద్ (ఎస్టీ) 48
- ఖమ్మం 12
