
- మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్
జూబ్లీహిల్స్, వెలుగు: నగర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు అండగా నిలవాలని మాజీ ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్యాదవ్కోరారు. ఆదివారం ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు.
ఈ నియోజకర్గంలో కాంగ్రెస్అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకున్న ఆయన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎర్ర కృష్ణ, హబీబా సుల్తానా, మహేశ్, ఆకాశ్, గణేశ్తదితరులుపాల్గొన్నారు.