
- బాడీలో సెల్ మెడియటేడ్ ఇమ్యూనిటీతో మనం భద్రం
- మన దేశంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువే
- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న వార్తలో నిజం లేదు
- డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించలేదు
- గాంధీ క్రిటికల్ కేర్ మెడిసిన్హెచ్ఓడీ ప్రొఫెసర్ కిరణ్ మాదాల
పద్మారావునగర్, వెలుగు: కొవిడ్భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ దవాఖాన క్రిటికల్కేర్మెడిసిన్హెచ్ఓడీ ప్రొఫెసర్డా.కిరణ్మాదాల కరోనా వ్యాప్తి, కొత్త వేరియంట్లు, నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై మాట్లాడారు. కొవిడ్–19 ఒకటి, రెండో దశల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన తర్వాత పలు వేరియంట్లతో దాని వ్యాప్తి కొనసాగుతునే ఉందన్నారు. 2021లో డెల్టా, 2022లో ఒమిక్రాన్వేరియంట్ల తర్వాత కరోనా వైరస్ప్రభావం బాగా తగ్గిందన్నారు. తర్వాత కొవిడ్ కేసులు నమోదైనప్పటికీ ప్రారంభ దశలో ఉన్నంత ప్రభావం లేదన్నారు. ఇంటర్నేషనల్కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి హాంకాంగ్, సింగపూర్దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయని, మనదేశంలో ఎక్కడా కొవిడ్కేసులు పెరగలేదన్నారు.
గతంలో జేఎన్-వన్, ఎక్స్బీబీ వేరియంట్ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్జాతికి సంబంధించిన వేరియంట్లుతిరిగి వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారని, కానీ డబ్ల్యూహెచ్ఓ ఇంకా నిర్ధారించలేదన్నారు. ప్రజల్లో రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుందని, గతంలో మనం తీసుకున్న వ్యాక్సిన్లతో వచ్చిన ఇమ్యూనిటీ బాడీలో నుంచి వెళ్లిపోయినప్పటికీ సెల్మెడియటేడ్ఇమ్యూనిటీ ఎప్పటికీ మన బాడీలో ఉంటుందన్నారు.
మన దేశంలో సాధారణంగా ఇమ్యూనిటీ పవర్ఎక్కువ అన్నారు. కొవిడ్ కేసులు, శ్వాస సంబంధిత సమస్యల్లో కొవిడ్శాతంపై ఎప్పటికప్పుడు ఐసీఎమ్ఆర్డేటా మెయింటెయిన్చేస్తోందన్నారు. తాజాగా ఐసీఎంఆర్విడుదల చేసిన గణాంకాల ప్రకారం శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లలో కొవిడ్ కేసులు కనీసం 60 శాతంపైన ఉంటున్నాయని తెలిపారు. పోస్ట్కొవిడ్సమయంలో మనం వాడిన స్టెరాయిడ్స్కారణంగా తర్వాత ఇమ్యూనిటీ తగ్గి బ్లాక్ఫంగస్కేసులు నమోదయ్యాయన్నారు. కానీ, బ్లాక్ఫంగస్అనేది వేవ్కాదన్నారు. ప్రజలు శుభ్రంగా ఉంటూ, మాస్కులు ధరిస్తే వైరస్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని డాక్టర్కిరణ్మాదాల పేర్కొన్నారు.