- సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో లాఅండ్ఆర్డర్ పరిరక్షణకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సీపీ సాయిచైతన్య తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. కొత్త ఏడాది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామన్నారు. ఉత్తమమైన రిజల్ట్సాధించడానికి ప్రజలు తమతో కలిసి రావాలన్నారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వచ్చి జిల్లాతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త ఏడాది ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
రిటైర్డ్ సిబ్బందికి వీడ్కోలు
జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి బుధవారం రిటైర్మెంట్ తీసుకున్న నలుగురిని సీపీ సాయిచైతన్య సన్మానించారు. కె.చందర్సింగ్ రాథోడ్ (సీఐ, సీసీఎస్), చెన్నుపల్లి ముక్తేశ్వర్రావు (ఏఆర్ఎస్ఐ), పి.సంజీవ్ (హెడ్ కానిస్టేబుల్, ధర్పల్లి), ఆర్.శివకుమార్ (హెడ్ కానిస్టేబుల్ త్రీటౌన్)ను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందించారు. పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఎలాంటి రీ మార్క్ లేకుండా రిటైర్ కావడం స్ఫూర్తిదాయకమన్నారు. అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రాంచందర్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు ఉన్నారు.
