
- సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు: ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడే రక్తం దానం చేయడం ప్రజలు జీవితంలో భాగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు. సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో రక్తదానం శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సోషల్ సర్వీస్లో పోలీస్ శాఖను ఎప్పుడూ భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆయిల్ కార్పొరేషన్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, పోలీస్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, మోహన్కిషోర్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు..
సీపీ ఆఫీస్లో నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయి చైతన్య బాధితులను ఒక్కొక్కరిగా పిలిచి సమస్యలను తెలుసుకుని ఎస్సైలకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పౌరులు నేరుగా తనను కలువొచ్చని సీపీ స్పష్టం చేశారు.