
- వరంగల్ జిల్లా నర్సంపేటలో దళిత సంఘాల ధర్నా
నర్సంపేట, వెలుగు: నర్సంపేట మహిళాజైలులో రిమాండ్ ఖైదీ పెండ్యాల సుచరిత మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కళ్లెపల్లి ప్రణయ్దీప్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు తడుగుల విజయ్ మాట్లాడుతూ ఓ కేసులో సుచరితను అరెస్ట్ చేసి నర్సంపేట జైలుకు తరలించారని, ఈ నెల 21న ఆమె అనుమానాస్పదంగా జైలులో చనిపోయిందని పేర్కొన్నారు.
ఆమెది సహజ మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. సీసీ పుటేజీని పరిశీలించి బాధ్యులను గుర్తించాలని డిమాండ్ చేశారు. మృతురాలి ఫ్యామిలీకి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. కొడారి రవి, యాకోబ్, నిరంజన్, ప్రభాకర్, వినయ్. కుమార్. జాకీ పాల్గొన్నారు.