న్యూఢిల్లీ దేశంలో డేటా సెంటర్ల బిజినెస్లో రూ. 81,247 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డేటా సెంటర్లకు డిమాండ్ పెరగడంతో 2020 నుంచి ఈ పెట్టుబడులు వచ్చినట్లు కాలియర్స్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. 2025 నాటికి దేశంలోని డేటా సెంటర్లు 20 మిలియన్ చదరపు అడుగులలో ఏర్పాటవుతాయని, అంటే ఏరియా రెట్టింపవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 10.3 మిలియన్ చదరపు అడుగులలో డేటా సెంటర్లున్నాయి. ఇండియాలోని డేటా సెంటర్ల కెపాసిటీ ప్రస్తుతం 770 మెటగా వాట్స్. ప్రధానంగా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్కతాలలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయని కూడా కాలియర్స్ ఈ రిపోర్టులో తెలిపింది.
డిజిటైజేషన్, క్లౌడ్ జోరు వల్లే.....
డిజిటైజేషన్, క్లౌడ్ వినియోగం బాగా పెరగడంతో డేటా సెంటర్ల బిజినెస్కూడా విస్తరించినట్లు వివరించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఇన్సెంటివ్స్ కూడా డేటా సెంటర్ ఆపరేటర్లను ఆకట్టుకుంటున్నట్లు వివరించింది. దీంతో ఈ బిజినెస్ బాగా జోరందుకుంటోందని పేర్కొంది. తక్కువ ధరకే స్థలం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. డేటా సెంటర్ల బిజినెస్లో 49 శాతం వాటాతో ముంబై టాప్ ప్లేస్లో నిలుస్తోంది. ల్యాండింగ్స్టేషన్, సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ ముంబై సిటీకి ఈ విషయంలో కలిసొస్తున్నాయని కాలియర్స్ వెల్లడించింది. 17 శాతం కెపాసిటీతో ఢిల్లీ రెండో ప్లేస్లో నిలుస్తోంది. ఆ తర్వాత ప్లేస్లో బెంగళూరు ఉందని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటిదాకా డేటా సెంటర్ల బిజినెస్ మొత్తం రూ. 81,247 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు కాలియర్స్ తెలిపింది. డెవలపర్లు, గ్లోబల్ ఆపరేటర్ల మధ్య పార్టనర్షిప్లు కూడా జోరందుకుంటున్నాయని వివరించింది. డేటా సెంటర్ బిజినెస్లో గ్లోబల్డేటా సెంటర్ ఆపరేటర్లు, కార్పొరేట్లు, రియల్ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది.
డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. దీంతో లాంగ్ టర్మ్ లో తట్టుకోగలిగే వాళ్లే డేటా సెంటర్ల బిజినెస్లో అడుగుపెడుతున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటులో రియల్ ఎస్టేట్ ఖర్చు 25 శాతమే. ఈ రంగంలో డెవలపర్లు, ఇన్వెస్టర్లకు చాలా చక్కని అవకాశాలున్నాయి. దేశంలోని డేటా సెంటర్లలో 22 శాతం డేటా సెంటర్లకు మాత్రమే లీడ్ సర్టిఫికేషన్ ఉంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు మెట్రో సిటీలే హబ్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంత మంది డేటా సెంటర్ ఆపరేటర్లు విజయవాడ, నాగ్పూర్, రాయ్పూర్, కోచ్చి, పాట్నా, మంగళూరు వంటి సిటీల వైపు చూస్తున్నారు.
‑ రమేష్ నాయర్, సీఈఓ,
కాలియర్స్ ఇండియా