కేజ్రీవాల్ టైమ్ అయిపోయింది: కేంద్రం

కేజ్రీవాల్  టైమ్  అయిపోయింది: కేంద్రం

న్యూఢిల్లీ: లిక్కర్  స్కామ్  కేసులో ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్​ను ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య 12 మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు. సెర్చ్  వారంట్  చూపించి ఆయనను కొంతసేపు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.

 కేజ్రీవాల్​ కావాలనే విచారణకు డుమ్మా కొడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్  సొలిసిటర్  జనరల్ ఎస్వీ రాజు అన్నారు. కేంద్రం తరపున ఆయన వాదనలు వినిపించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు పంపిందని, ఆయన టైమ్  అయిపోయిందని రాజు  పేర్కొన్నారు. ఈడీ సమన్లు చట్టవ్యతిరేకం అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

కాగా,  శుక్రవారం కేజ్రీవాల్​ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అంతకుముందు కేజ్రీవాల్  ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు ట్యాబ్స్​, ఒక ల్యాప్ టాప్  నుంచి డేటాను ట్రాన్స్ ఫర్  చేసుకున్నారు.