
బాకు (అజర్బైజాన్): తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసికి ఫిడే వరల్డ్ కప్ చెస్ టోర్నీలో నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్ టైబ్రేకర్ (సడెన్ డెత్)లో ఆర్. ప్రజ్ఞానంద 5–4తో అర్జున్పై నెగ్గి సెమీస్లోకి దూసుకెళ్లాడు. తాజా విజయంతో 17 ఏళ్ల ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ ఈవెంట్స్లో దాదాపుగా చోటు దక్కించుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొంటున్న తొలి ఇండియన్ చెస్ ప్లేయర్గా ప్రజ్ఞానంద రికార్డులకెక్కనున్నాడు. హోరాహోరీగా సాగిన తొలి 5+3 బ్లిట్జ్ గేమ్లో ప్రజ్ఞానంద ఈజీగా అర్జున్కు చెక్ పెట్టాడు. సెమీస్లో ప్రజ్ఞానంద.. ఫ్యాబియానో కరువానా (అమెరికా)తో తలపడతాడు.