‘పెట్టుబడి పోగా ఎంతోకొంత మిగిలితే చాలు’ అనుకుంటారు రైతులు. కానీ, బీహార్లోని గయకి చెందిన రాజేష్సింగ్ అలా అనుకోలేదు. తనతో పాటు మరో నలుగురు రైతులు బాగుపడాలి అనుకున్నాడు. రైతులకి రెగ్యులర్ ఆదాయం ఉండాలి అనే ఆలోచనతో మష్రూమ్ కల్టివేషన్ మొదలుపెట్టాడు.
గోధుమ గడ్డి, ఏసీ వాతావరణంలో మష్రూమ్ యూనిట్ ఏర్పాటు చేసి లాభాల బాటలో సాగుతున్నాడు.
మష్రూమ్స్.. తడి ఉన్నచోట గుట్టలు గుట్టలుగా పెరుగుతాయి. ఇంటి దగ్గర మష్రూమ్స్ పెంచడమంటే కొంత కష్టమే. అలాంటిది కొత్తపద్ధతిలో పుట్టగొడుగుల్ని పెంచి చూపిస్తున్నాడు రాజేష్. పెద్ద పెద్ద పాలిథీన్ సంచుల్లో గోధుమ పొట్టు కలిపిన కంపోస్ట్ నింపి, వాటిలో మష్రూమ్స్ పెంచుతున్నాడు. ‘‘రైతులకి రెగ్యులర్ ఆదాయం ఉండాలని ఈ యూనిట్ మొదలుపెట్టాను. గోధుమగడ్డి, కంపోస్ట్తో తక్కువ ఖర్చులోనే పుట్టగొడుగుల్ని పెంచుతున్నా. మష్రూమ్స్ ‘వింటర్ వెజిటబుల్’ కాబట్టి యూనిట్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉంచడం కోసం ఏసీలు ఏర్పాటు చేశా. మేం పండించే మష్రూమ్స్కు డిమాండ్ బాగా ఉంది. ఒక్కోసారి పండించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి”అని చెప్పాడు రాజేష్.
రోజుకు 300 కిలోలు
‘‘నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. పదిహేనేళ్లు జాబ్ చేసినంక నాకు వ్యవసాయం చేయాలనిపించింది. నలుగురికి ఉపాధి కల్పించడంతో పాటు నాకు, నా ఫ్యామిలీకి రెగ్యులర్గా డబ్బు వచ్చే మార్గం గురించి ఆలోచించాను. ఇన్డోర్ మష్రూమ్ కల్టివేషన్ని2016లో మొదలుపెట్టాను. ఇప్పుడు మా యూనిట్లో రోజుకి 200 నుంచి 300 కిలోల మష్రూమ్స్ కోతకి వస్తాయి. వాటిని ప్యాక్ చేసి అమ్ముతున్నాం” అంటున్న రాజేష్ని చాలామంది రైతులు ఫాలో అవుతున్నారు.