27న సిటీలో తాగునీటి సరఫరాకు అంతరాయం

27న సిటీలో  తాగునీటి సరఫరాకు అంతరాయం
  • బోరబండ రిజర్వాయర్ పరిధిలో అంతరాయం

హైదరాబాద్: నగరంలోని లింగంపల్లి నుంచి బోరబండ వరకు ఉన్న 800 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ స్థానంలో కొత్తగా 800 ఎంఎం డయా ఎంఎస్ పైప్ లైన్ వేయాలని జలమండలి నిర్ణయించింది. 27వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు  28న శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. అందువల్ల 24 గంటలు బోరబండ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. 28.01.2022 నాడు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నీటి సరఫరా జరుగుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6, 9: బోరబండ, అల్లాపూర్, గాయత్రినగర్, పర్వత్నగర్, వివేకానందనగర్, ఎస్పీఆర్ హిల్స్, శ్రీరామ్నగర్, కార్మిక నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.​

 

ఇవి కూడా చదవండి

ఒక్క మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా టాలెంట్ అంచనావేయలేం

కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం

అవమానాల్ని దాటి..