కొద్దిరోజుల క్రితం గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన పెద్ద అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోయిన సంగతి మీకు తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్క్లబ్ ఓనర్లు సౌరవ్ లూత్రా, గౌరవ్ లూత్రా అనే ఇద్దరు అన్నదమ్ములపై త్వరలో అంతర్జాతీయంగా వెతికే బ్లూ కార్నర్ నోటీసును జారీ కానుంది.
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఈ ఇద్దరు అన్నదమ్ములు దేశం వదిలి పారిపోయారు. దింతో వారిని పట్టుకోవడానికి గోవా పోలీసులు ఇంటర్పోల్ అనే అంతర్జాతీయ పోలీసు సంస్థ సహాయం తీసుకోబోతున్నారు.
థాయిలాండ్కు పారిపోయిన అన్నదమ్ములు :
పోలీసుల ప్రకారం, లూత్రా సోదరులు డిసెంబర్ 7న ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానంలో ఫుకెట్ (థాయిలాండ్) పారిపోయారు. ఈ నైట్క్లబ్ ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్లబ్ సిబ్బందే ఉండగా, ఐదుగురు పర్యాటకులు కూడా ఉన్నారు.
యజమానులపై లుక్అవుట్ నోటీసు:
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే వారిపై దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. ఢిల్లీలోని వీరి ఇంటికి కూడా తాళం వేసి ఉండగా.. వీరి బిజినెస్ పార్ట్నర్ అయిన అజయ్ గుప్తా కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసులో భరత్ కోహ్లీ, రాజీవ్ మోదక్, వివేక్ సింగ్, రాజీవ్ సింఘానియా, రియాన్షు ఠాకూర్ సహా కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు.

