హైదరాబాద్లో మరో డ్రాగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగిలాల్, ఓం ప్రకాష్ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఓపియం డ్రగ్స్ (నల్లమందు) 1.5 కేజీను సీజ్ చేశారు. నిందితుల వద్ద ఉన్న హోండా అక్టీవ్ బైక్ ,రెండు మోబైల్స్, నగదును పోలీసులు తీసుకున్నారు. ఉప్పల్ బీటీ కమాన్ లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ లూనీ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో మంగిలాల్ కీలక నిందితుడిగా గుర్తించారు. ఇతడు రాజస్థాన్ నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి: