
ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇంటిబాట పట్టిస్తున్నాయి. ఈ క్రమంలో పే ప్యాకేజీలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయానికి వస్తే టెక్ నిపుణులు ట్రెండ్లలో మార్పును ప్రదర్శిస్తున్నారు. టెక్ కంపెనీలలో భారీ తొలగింపులు వందల, వేల మందికి ఉద్యోగాలు లేకుండా చేశాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు తక్కువ వేతన ప్యాకేజీలకు కూడా సిద్ధంగా ఉన్నారు.
"ఐటీ ప్రపంచంలో రోజురోజుకూ వస్తోన్న మార్పుల నేపథ్యంలో నేను తక్కువ డబ్బు సంపాదించైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను" అని ఓ మెటా ఉద్యోగి అంటున్నారు. బ్లైండ్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం మెటా,, సేల్స్ఫోర్స్ వంటి ప్రధాన కంపెనీలకు చెందిన టెక్ నిపుణులు జీతాల కంటే ఉద్యోగం ఉంటే చాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ:జూలై నెలలో బ్యాంకు సెలవులు ఇవే
అధ్యయనం నుంచి కీలక ఫలితాలు:
- కెరీర్ వృద్ధి, పని-జీవిత సమతుల్యత, కంపెనీ సంస్కృతి వంటి నాన్-మానిటరీ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, ఉద్యోగ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ఇంజనీర్లు తమ జీతం అంచనాలను తగ్గించుకుంటున్నారు.
- ప్రస్తుత మార్కెట్లో మిడ్-లెవల్ టాలెంట్ అధికంగా ఉండటం వల్ల, ఎంట్రీ, సీనియర్-లెవల్ పీర్లతో పోల్చితే మిడ్-లెవల్ ఇంజనీర్లు తమ జీతం లాంటి అవసరాలను గణనీయంగా తగ్గించుకుంటున్నారు. టాప్ టెక్ హబ్లలోని ఇంజనీర్లు అధిక జీతాలను సంపాదిస్తారు కానీ జీతం అంచనాలలో మరింత గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్నారు.
- మిడ్ అండ్ సీనియర్ లెవల్ల్ మహిళా ఇంజనీర్లకు లింగ వేతన వ్యత్యాసం ముఖ్యమైన సమస్యగా మిగిలిపోయింది, అయితే కొత్తగా రూపొందించిన ఇంజనీర్లు మాత్రం జీతం విషయంలో పలు అంచనాలను కలిగి ఉన్నారు. ఇవి పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సమానంగా ఉన్నాయి.
- ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, 56 శాతం మంది టెక్ వర్కర్లు తక్కువ వేతనాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
- ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులు జీతం అంచనాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, 45 శాతం మంది ప్రతివాదులు పోల్చదగిన లేదా తక్కువ జీతాలను అంగీకరించడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.