హామీల అమలులో ప్రభుత్వం విఫలం : పల్లా రాజేశ్వర్​రెడ్డి

 హామీల అమలులో ప్రభుత్వం విఫలం : పల్లా రాజేశ్వర్​రెడ్డి

జనగామ, వెలుగు: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనగామ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంప్​ఆఫీస్ లో జనగామ టౌన్, రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.2.46 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​చెక్కులు అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లోటు ఉందని పదే పదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయోజనం లేని అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.  కార్యక్రమంలో బీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.