- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్భందీగా నిర్వహించాలని, ఫలితాలు మెరుగుపడేందుకు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం మాచారెడ్డి మండలం సోమార్పేట జడ్పీ హైస్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. క్లాస్లను ఆయన పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వివిధ సబ్జెక్ట్ ఆంశాలపై విద్యార్థులను కలెక్టర్ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు. ఉన్నత ఆశయంతో కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు. డీఈవో రాజు, టీచర్లు ఉన్నారు.
సోమార్పేట పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తండాలో వడ్ల కొనుగోలు సెంటర్ను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో మద్నూర్ సీసీఐ సెంటర్కే కాకుండా పత్తిని తమకు సమీపంలోని జిల్లాల్లో ఉన్న పత్తి కొనుగోలు సెంటర్లకు పత్తిని రైతులు తరలించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రైతులు తమకు దగ్గరగా ఉన్న వేములవాడ, దౌలతాబాద్, సిద్దిపేట, తోగుట సెంటర్లకు పత్తిని తీసుకెళ్లి అమ్ముకోవచ్చన్నారు.
మన జిల్లా రైతుల కోసం స్లాట్ బుకింగ్లో ఈ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని సూచించారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు ఏఈవో వద్ద ఆన్లైన్లో ఎంట్రీ చేయించుకోవాలన్నారు. అలాగే జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ఈ నెలాఖరులోగా కంప్లీట్ కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ పేర్కొన్నారు. గురువారం వడ్ల కొనుగోళ్లపై జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. సెంటర్లలో తక్షణమే తూకాలు చేయాలన్నారు. సెంటర్ల నుంచి మిల్లులకు వడ్ల తరలింపు పక్రియ వేగంగా జరగాలన్నారు.అడిషనల్ కలెక్టర్ విక్టర్ , అధికారులు ఉన్నారు.
