
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సెంటర్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ స్వీకరణ సెంటర్లలో తగిన వసతులు ఉండాలన్నారు. నామినేషన్ ఫారాలు, ఓటరు లిస్టు, సిద్ధం చేయాలని ఆదేశించారు. డిస్ర్టిబ్యూషన్ సెంటర్లలో వసతులతో పాటు, ఆయా రూట్ల మ్యాప్లను రెడీ చేయాలన్నారు.
బ్యాలెట్ బాక్స్లను జిల్లా కేంద్రం నుంచి తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, నీటి వసతి, కరెంట్ఇతర సౌకర్యాలు ఉండాలన్నారు. మండల స్థాయిలో ఎలక్షన్ ఫ్లాన్ను ఎంపీడీవోలు తయారు చేయాలన్నారు. పోటీ చేసే వారికి వ్యయ పరిమితులను ముందుగానే వారికి తెలియజేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్నాయక్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీపీవో మురళీ, జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.