పొంగే వాగులు, వంకలు దాటొద్దు : కమిషనర్ సునీల్ దత్

పొంగే వాగులు, వంకలు దాటొద్దు : కమిషనర్ సునీల్ దత్
  • పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బుధవారం నగరంలోని కాల్వఓడ్డు, ప్రకాశ్ నగర్ మున్నేరు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవరసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. 

అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్  8712659111, కలెక్టర్ ఆఫీస్  టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం అందిచాలని సూచించారు. సీపీ వెంట టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్​స్పెక్టర్ మోహన్ బాబు ఉన్నారు.