రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి  పీడీ అతీఖుల్లా తెలిపారు. మంగళవారం పిట్లం హైస్కూల్​లో 12 రోజుల పాటు నిర్వహించిన ఖోఖో శిక్షణా శిబిరంలో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసి మాట్లాడారు.   58వ రాష్ట్రస్థాయి  పోటీలు ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు పెద్దపల్లి జిల్లాలోని ఇండియన్ మిషన్​ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 ఉమ్మడి జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు కవిత, దశరథం, డాకూరి వెంకట్​రెడ్డి, ఇమ్రోజ్, రమణారావు, క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించిన కోవూరి శివకుమార్​, విజయ్​కుమార్​లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో దేవిసింగ్​, ఏఎంసీ వైస్ చైర్మన్​ కృష్ణారెడ్డి, పీఈటీలు రాజు, ప్రియాంక,  సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.