కొట్ర గ్రామంలో ఒకే రోజు పదకొండు ఇండ్లల్లో చోరీ

కొట్ర గ్రామంలో ఒకే రోజు పదకొండు ఇండ్లల్లో చోరీ

కల్వకుర్తి, వెలుగు: వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి పదకొండు ఇండ్లల్లో దొంగలు పడి అందిన కాడికి దోచుకుని వెళ్లారు. వెల్దండ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పదకొండు ఇండ్లల్లో దొంగలు చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కడారి పార్వతమ్మ శుక్రవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది.

దొంగలు పడ్డారని గ్రామస్తుల సమాచారం మేరకు ఇంటికి వచ్చి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి ఉండటంతో  పోలీసులకు ఫిర్యాదు చేసింది.   ఐదు తులాల బంగారం, మూడు లక్షల ఎనభై వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. క్లూస్ టీమ్ ఆధారాలు  సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.