మణిపూర్​కు ప్రధాని ఎందుకు పోతలే .. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం

మణిపూర్​కు ప్రధాని ఎందుకు పోతలే .. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం
  • రెండేండ్లుగా అక్కడ జనం ఇబ్బందులు పడుతున్నా పట్టదా?

న్యూఢిల్లీ: రెండేండ్లుగా మణిపూర్ అల్లర్లు, సమస్యలతో సతమతమవుతున్నా ప్రధాని నరేంద్రమోదీ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు, సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. డబుల్ ఇంజన్​ సర్కార్​ అక్కడి ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎందుకు ఫెయిల్​ అయిందని శనివారం ఆయన ట్వీట్​ చేశారు.  2023 మే నుంచి మణిపూర్​లో ఆందోళనలు కొనసాగుతున్నాయని.. రెండు రోజుల కింద కూడా అల్లర్లలో 25 మంది గాయపడ్డారని తెలిపారు.  రెండేండ్ల నుంచి జరుగుతున్న హింస కారణంగా ఇప్పటి వరకు 260 మంది చనిపోగా, 68 వేల మంది రాష్ట్రాన్ని వదలి వెళ్లపోయారని, వేలాది మంది రిలీఫ్​ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. 

2022 జనవరిలో మణిపూర్​లో మీరు చివరి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీరు 44 ఫారిన్​ టూర్లు, 250 దేశీయ పర్యటనలు చేపట్టారు. కనీసం ఒక్క సెకండ్​ కూడా మణిపూర్​లో గడపలేదు. ఆ రాష్ట్రంపై ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత కోపం? ఇదేనా మీ నిబద్ధత? ఇదేనా రాజధర్మం?” అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. అర్ధరాత్రి 2 గంట తర్వాత హడావుడిగా ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన తీర్మానం చేసిందని, అసమర్థతనను కప్పించుకునేందుకు ఇట్ల చేశారని ఆయన దుయ్యబట్టారు.