
మహబూబాబాద్, వెలుగు: మానుకోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో మెడికల్ విద్యార్థుల కోసం రూ. 250 కోట్లతో నిర్మించిన బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాల సముదాయం, క్రిటికల్ కేర్ యూనిట్, డైనింగ్ హాల్, కిచెన్ బిల్డింగులను నేడు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం పడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.