
- ప్రభుత్వ సలహాదారుడిని కోరిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి సహకరించాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. మంగళవారం హైదరాబాద్లో నరేందర్ రెడ్డి నివాసంలో పలువురు నాయకులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. బెల్లంపల్లిలో బస్ డిపో నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి అనుమతులు ఇవ్వాలని కోరారు.
పట్టణంలో 100 పడకల ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలు, యంత్రాలు, సరిపడా డాక్టర్లు, పారామెడికల్సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. బల్దియాలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అనంతరం సింగరేణి భవన్లో సీఎండీబలరాం నాయక్ను కలిసి బెల్లంపల్లి నియోజకవర్గంలో సింగరేణి పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎం.మల్లయ్య, నాయకులు కె.రాంచందర్, దావ రమేశ్, ఎం.నర్సింగారావు ఉన్నారు.