రైతుల కన్నీటి గోస కలెక్టర్​కు పట్టదా : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి

రైతుల కన్నీటి గోస కలెక్టర్​కు పట్టదా : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి

దుబ్బాక, వెలుగు: వడగండ్ల వర్షంతో చేతికొచ్చిన పంట రైతుల కళ్లేదుటే నేలరాలిపోయి బోరున విలపిస్తుంటే కలెక్టర్​ భూభారతి సదస్సులకు వెళ్లడమేంటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తొగుట మండలం కాన్గల్, లింగంపేట, తొగుట, పెద్దమాసాన్​పల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటలను ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్యతో కలిసి పరామర్శించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ..నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేల పరిహారాన్ని ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.