కామారెడ్డి సభను విజయవంతం చేయాలి : నాగపురి కిరణ్కుమార్గౌడ్

కామారెడ్డి సభను  విజయవంతం చేయాలి : నాగపురి కిరణ్కుమార్గౌడ్

జనగామ, వెలుగు: ఈ నెల 15న నిర్వహించనున్న కామారెడ్డి బీసీ మహాసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ పార్టీ రాష్ర్ట నాయకుడు నాగపురి కిరణ్​కుమార్​గౌడ్​ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ లో రూ.4 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో దూడల సిద్ధయ్య, గనిపాక మహేందర్, నూకల బాల్​రెడ్డి, కొత్త కరుణాకర్​రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మహేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.