నీట్ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల

నీట్ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల
  • 26,608 మందికి సీట్లు కేటాయింపు 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా వైద్య, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి చేపట్టిన నీట్ (యూజీ) కౌన్సెలింగ్ మొదటి రౌండ్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. మొదటి రౌండ్‌‌లో మొత్తం 26,608 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్లు ఎంసీసీ ప్రకటించింది.  ఈ ఫలితాలు mcc.nic.inలో ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్ధులు తమ సీటు అలాట్మెంట్ స్టేటస్​ను వెబ్ సైట్​లో పొందుపరిచిన రిసల్ట్ పీడీఎఫ్​లో చెక్ చేసుకోవాలని సూచించింది. 

సీటు పొందిన విద్యార్థులు గురువారం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్​ ప్రకారం సంబంధిత కాలేజ్, ఇన్ స్టిట్యూషన్ లో రిపోర్ట్ చేయాలని తెలిపింది. రిపోర్టింగ్‌‌కు ముందు, అభ్యర్థులు తమ అలాట్మెంట్ లెటర్‌‌ను ఎంసీసీ అధికారిక వెబ్‌‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకెళ్లాలని పేర్కొంది. నిర్ణీత సమయం గడిచిన తర్వాత ఎలాంటి క్లైములు స్వీకరించబోమని, సమయానికి ముందే రిపోర్ట్ చేయాలని చెప్పింది. మరిన్ని వివరాల కోసం వెబ్‌‌సైట్‌‌ను చెక్ చేయాలని ఎంసీసీ పేర్కొంది.