- విచారణ జరిపి నివేదికకు ఆదేశం
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ప్రసవాల కోసం వచ్చిన గర్భిణులు ప్రసవాల తరువాత మరణించడం, పుట్టిన శిశువులు కూడా మృతి చెందిన ఉదంతాలను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సీరియస్గా పరిగణించారు. మంగళవారం ఆయన మాతాశిశు మరణాల నిరోధక కమిటీ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్న తరువాత ఇలా ఎందుకు జరిగిందో విచారణ చేసి తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగిన మాతాశిశు మరణాలను ఒక్కొక్కటిగా సమీక్షించారు.
విచారణలో డాక్టర్ల నిర్లక్ష్యం అని తేలితే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. గర్భిణులకు క్రమంగా హెల్త్ చెకప్ చేయాలని, పుట్టింటికి వెళ్తే వారి రికార్డులను అక్కడి మెడికల్ ఆఫీసర్లకు పంపాలన్నారు. నర్సింగ్ హోమ్లో క్వాలిఫైడ్ డాక్టర్లతోనే ప్రసవాలు చేయించాలన్నారు. స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు. అడిషనల్కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారణి రసూల్బీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు.
ఎలక్షన్ డ్యూటీలపై నిర్లక్ష్యం వద్దు..
గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు యంత్రాంగం రెడీగా ఉండాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జీపీ ఎన్నికల సక్సెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల విధులు సవాళ్లతో కూడి ఉంటాయ న్నారు. అడిషనల్కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీపీవో శ్రీనివాస్రావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఏవో రాజబాబు ఉన్నారు.
